Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిచిపోయిన పాఠ్య పుస్తకాలు
నవతెలంగాణ-కొత్తూరు
భారీ వర్షాలతో ఎంఆర్సీ భవనంలోకి నీరు రావడంతో విద్యార్థులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలు తడిసిపోయాయి. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలకేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో విద్యార్థులకు అందించాల్సిన పాఠ్య పుస్తకాలు నిల్వ ఉంచారు. సోమవారం మండలంలో భారీ వర్షం పడటంతో ఎంఆర్సీ భవనంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దాంతో పాఠ్య పుస్తకాలు తడిసి ముద్దయ్యాయి. వెంటనే తేరుకున్న సిబ్బంది వాటిని బల్లలపైన, కుర్చీలపైన పెట్టి తడిచిపోకుండా చూశారు. ఈ విషయమై ఎంఈఓ కిష్టారెడ్డిని ఫోన్లో వివరణ కోరగా.. పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పుస్తకాలను ఎంఆర్సీ భవన్లో భద్రపరిచామని తెలిపారు. భవనం ఎన్నో ఏండ్ల కింద నిర్మించినందున భవనం రోడ్డు కంటే దిగువకు ఉండటంతో తరచుగా భవనం లోపలికి వర్షపు నీరు వస్తోందన్నారు. ప్రస్తుతం పాఠ్య పుస్తకాలు పెద్దగా ఏమీ తడిచిపోలేదని తెలిపారు.