Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అన్ని రంగాల్లో అణగారిపోయిన ఎస్సీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఇలాంటి బృహత్తరమైన పథకం మరెక్కడా లేదని ఆయన చెప్పారు. దీని అమలు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గానికి 100 యూనిట్లకు సంబంధించి మొత్తం 11,500 గ్రౌండింగ్ పూర్తి కాగా, మిగిలిన 335 యూనిట్ల గ్రౌండింగ్ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. నియోజకవర్గానికి 1500 యూనిట్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందనీ, వచ్చే ఎనిమిదేండ్లలో 17లక్షల ఎస్సీ కుటుంబాలకు అందుతుందని తెలిపారు.