Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల సమయాల్లో విద్యార్థులకు అనుగుణంగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ అసోసియేషన్(టీఎస్డబ్ల్యుఆర్టీఈఏ) అధ్యక్షులు సీహెచ్ బాల రాజు సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఒక్కో పాఠశాల, కళాశాలల్లో సుమారు 640 మంది విద్యార్థులు ఉదయం సిద్ధం కావడానికి వీలుగా ఉదయం 8గంటలకు బదులు 9 గంటల నుంచి తరగతులు ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు వ్యాయామం, విజ్ఞానం - వినోదం విశ్రాంతి కల్పిస్తూ వారి సర్వతో ముఖాభివృద్దికి కొత్త సమయాల ప్రకారం అవకాశం కల్పించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్,తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.