Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు 77.03 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. వచ్చేనెల పదో తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 25,338 మంది దరఖాస్తు చేశారనీ, వారిలో 19,519 (77.03 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. 5,819 (22.97 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని వివరించారు. తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. మంగళవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది.