Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాసర ట్రిబుల్ ఐటీలో శాశ్వత వైస్చాన్సలర్(వీసీ)ని నియమించాలని, నాణ్యమైన ఆహారంతోపాటు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సీఎం కేసీఆర్కు సోమవారం లేఖ రాశారు. వారం రోజులనుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆందోళన విరమించారని గుర్తుచేశారు. హామీ మేరకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని తెలిపారు. ఆందోళన విరమించిన కొద్ధిరోజులకే యూనివర్శిటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని పేర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో సమస్య మరింత తీవ్రతరమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రభుత్వ యూనివర్శిటీలు, గురుకుల పాఠశాలలో కూడా కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యంపాలైన ఘటనలు వెలుగుచూస్తున్నాయని తెలిపారు.