Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు ఫస్టియర్కు 89.6 శాతం, సెకండియర్కు 88.5 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. వచ్చేనెల పదో తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈనెల 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 19 వరకు ఈ ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి 79,347 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారనీ, వారిలో 71,057 (89.6 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. 8,290 (10.4 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 36,264 మంది దరఖాస్తు చేస్తే, వారిలో 32,090 (88.5 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. 4,174 (11.5 శాతం) మంది పరీక్ష రాయలేదని తెలిపారు. సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, యాదాద్రి, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో పరిశీలకులు పర్యటించి పరీక్ష నిర్వహిస్తున్న తీరును పరిశీలించారని వివరించారు.