Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మూడోసారి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనీ, కేసీఆరే సీఎం అవుతారని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. సోమవారం తిరుమలలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, కారగ్రెస్ పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మబోరని తెలిపారు. ప్రజల హృదయాల్లో కేసీఆర్ చిరస్థాయిగా ఉంటారని అన్నారు. టీటీడీ సహకారంతో కరీంనగర్లో పదెకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మిచబోతున్నట్టు తెలిపారు.