Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 992 మందికి కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 992 మందికి కరోనా సోకింది. మంగళవారం సాయ ంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 41,182 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 852 మంది డిశ్చార్జి అయ్యారు. 842 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,132 యాక్టివ్ కేసులున్నా యి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 227 మంది చికిత్స పొందుతు న్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా 376 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 2.40 శాతంగా నమోదయింది.