Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దూరవిద్య ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలు సెప్టెంబర్/అక్టోబర్లో జరుగుతాయనితెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పివి శ్రీహరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11 నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపునకు గడువు ఈనెల 22 వరకు ఉందని తెలిపారు. ఆలస్య రుసుం ప్రతి పేపర్కు రూ.25తో ఈనెల 23 నుంచి 29 వరకు ఉందని సూచించారు. ప్రతి పేపర్కు రూ.50తో ఈనెల 30 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని వివరించారు. మీసేవ, టీఎస్ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలని కోరారు. చలాన్లు, డీడీలను అనుమతించబోమని స్పష్టం చేశారు.