Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్) పబ్లిక్ పరీక్షల ఫీజు తేదీలను ఖరారు చేసింది. టెన్త్, ఇంటర్ విద్యార్థుల పరీక్షలు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో జరుగుతాయని శుక్రవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన పరీక్ష ఫీజులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 నుంచి 22వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఒక్కో పేపర్కు రూ.25 అపరాధ రుసుముతో 23 నుంచి 29వ తేదీ వరకు, ఒక్కో పేపర్కు రూ.50 అపరాధ రుసుముతో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1వ తేదీలోపు చెల్లించాలని వివరించారు. సంస్థ వెబ్సైట్ www.telanganaopensvhool.org ద్వారా లేదా మీ-సేవా, టీఎస్ ఆన్లైన్ ద్వారా పరీక్షా ఫీజులు చెల్లించాలి. చలానాలు, డీడీలను అనుమతించబోమని సంస్థ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.