Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
చేనేత కార్మికుల పోరాటల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిందని నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మెన్ దాసు సురేశ్ అన్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని 80 వేల మంది చేనేత కార్మికులకు రూ.5 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ పధకం అమల్లోకి వస్తున్నదని శుక్రవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ స్కీంను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు చెప్పారు.