Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరిగిన నష్టాలను కష్టాలను వివరిస్తూ, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను, ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ఆయన రగిలించారని స్మరించుకున్నారు. జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి, మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఆయన ఆశించినట్టుగానే స్వయంపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ కలను సాకారం చేస్తున్నదని సీఎం చెప్పారు.