Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పోడు సాగుదారులపై అటవీశాఖ అధికారుల దాడులు వెంటనే ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలు పడుతుండడంతో రైతులు పంటలు వేసుకోవడానికి పోడు భూములను దున్నుతుంటే రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు వారిపై దాడులు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు సాగుదారులందరికీ పట్టాలిస్తామని ప్రకటించారని గుర్తు చేశౄరు. వారి నుంచి దరఖాస్తులు తీసుకుని ఆరు నెలలు గడుస్తున్నా...ఇప్పటివరకు పోడు సాగు పత్రాలు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. దరఖాస్తులు పెండింగ్లో ఉన్న సమయంలోనే పోడు సాగుదారులను భూమి నుంచి వెళ్ళగొట్టడం అన్యాయమనీ, అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్న పోడు విస్తీర్ణాన్ని సర్వే చేయించి, వచ్చిన దరఖాస్తులను గుర్తించి అర్హులైన పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.