Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం వచ్చిన దరఖాస్తులన్నింటికీ తక్షణం అమోదం తెలపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చీఫ్ పర్సనల్ మేనేజర్ క్షేత్రస్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. జులై 31వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులన్నింటికీ ఆమోదం తెలిపి, వారు రిటైర్ అయినట్టు ప్రకటించాలని పేర్కొన్నారు. అయితే వీఆర్ఎస్కు 600 లోపు ఉద్యోగులే దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. తొలుత రెండువేల మంది వరకు ఉన్నారని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అయితే వారిలో అనేకమంది ఆ తర్వాత తమ దరఖాస్తుల్ని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారిలో మెడికల్ అన్ఫిట్ అయిన వారే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.