Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 345 మందికి కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 345 మందికి కరోనా సోకింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 23,780 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 265 మంది డిశ్చార్జి అయ్యారు. 582 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,752 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ లో అత్యధికంగా 146 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 1.45 శాతంగా నమోదయింది.