Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ వ్యాఖ్యలపై కవిత ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నదంటూ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజ్భవన్ను రాజకీయవేదికగా మార్చారని తెలిపారు. ఈమేరకు గురువారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేసేందుకే తమిళిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారంతో రాష్ట్ర ప్రజల మన్ననలను పొందలేరని గ్రహించిన నేపథ్యంలోనే గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయని విమర్శించారు.
సరైందికాదు : నిరంజన్రెడ్డి
గవర్నర్ అధికార దర్పాన్ని ప్రదర్శించానుకోవడం సరైందికాదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంరజన్రెడ్డి తెలిపారు. ఆమె తన హోదాకు తగినట్టుగా ప్రవరించాలని సూచించారు. 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.