Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం
- కాంగ్రెస్ నేత కృష్ణ తేజ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని ఏఐసీసీ సభ్యులు, అధికార ప్రతినిధి కృష్ణతేజ విమర్శించారు. గవర్నర్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నరే కాదనీ, రాష్ట్ర ప్రజలు కూడా అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంతో మొదలైన ఘర్షణ ఇప్పటికీ కొనసాగుతున్నదని చెప్పారు. దీంతో రాజ్భవన్లో ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ...ప్రజల సమస్యలను స్వీకరించడం మంచి శుభపరిణామామని పేర్కొన్నారు. కరోనా, యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీ, టీచర్ల భర్తీ తదితర సమస్యలపై సమస్యలపై స్పందిచారని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనపై నివేదిక కోరిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలకే కాకుండా గవర్నర్కు కూడా అవమానాలు తప్పడం లేదని విమర్శించారు. గవర్నర్ సంధించిన ప్రజలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.