Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్-2 రాతపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈనెల 11న (ఆదివారం) ఉదయం 10 నుంచి హైదరాబాద్లోని అశోక్నగర్లో ఉన్న తమ అకాడమిలో ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెప్ పి క్రిష్ణప్రదీప్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సదస్సులో సీనియర్ అధ్యాపకులతో గ్రూప్-2 సిల బస్, పరీక్షలకు సన్నద్ధం కావడం, ప్రణాళిక, నోట్స్ మేకింగ్, సమయపాలన వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.