Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్(రూరల్), వరంగల్ అర్బన్, జనగాం, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, నాగర్కర్నూల్, ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ నివేదిక ప్రకారం గురువారం రాష్ట్రంలో 505 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రాలో అత్యధికంగా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం(గురువారం రాత్రి పది గంటల వరకు) రికార్డయింది. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఇంటీరియల్ కర్నాటక పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ఆవర్తనం బలహీనపడింది.