Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్15,16 తేదీల్లో సాహిత్య సభలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాకవి కాళోజీ ధిక్కార తత్వానికి ప్రతీకని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రజాకవి కాళోజీ చేసిన సాహిత్య సేవలను స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16 తేదీల్లో సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం- 2022 కు ఎంపికైన ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్కు ఈ సందర్భంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అయాచితం శ్రీధర్, సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, అధికార భాషా సంఘం చైర్మెన్ మంత్రి శ్రీదేవి, టీఎస్ ఫుడ్స్ చైర్మెన్ మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి పాల్గొన్నారు.