Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ ప్రసంసించారు. ఆయన ఆ రాష్ట్ర అధికారుల బృందం మేడ్చల్-మల్కాజ్గిరి, సిద్దిపేట జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, జరుగుతున్న పనులను అడిగి తెలుసు కున్నారు. పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్క్ (కండ్లకోయ ఆక్సీజన్ పార్క్), ఔటర్ రింగ్ రోడ్లో పచ్చదనాన్ని ఉత్తరప్రదేశ్ బృందం పరిశీలిం చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జప్తి సింగాయి పల్లి నర్సరీ, ములుగు నర్సరీలను కూడా సందర్శించారు.