Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలకు జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలనీ, జీవో నెంబర్ 60 అమలు చేయడంతోపాటు యాజమాన్యం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరు తూ చేస్తున్న తమ సమ్మెకు మద్దతివ్వాలని ప్రతిపక్షపార్టీలు, రాష్ట్ర కార్మిక సంఘా లకు సింగరేణి కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఆది వారం ఈ మేరకు జేఏసీ నాయకులు హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షు లు రేవంత రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్బోస్, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్రాజ్ వర్మ, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం, ఐఎఫ్టీయూ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ తదితరులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. నాయకులను కలిసిన బృందంలో జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, బి.మధు, యర్రగాని కృష్ణయ్య, ఇనపనూరి నాగేశ్వరరావు ఉన్నారు.