Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న ప్రారంభోత్సవం
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో నిర్మించిన బంజారా భవన్ను మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పరిశీలించారు. బంజారా సామాజిక తరగతికి తెలంగాణ ప్రభుత్వం రూ.200 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేటాయించి రూ.50 కోట్లతో అత్యాధునిక హంగులతో భవనాన్ని నిర్మించారు. కాగా ఈనెల 17న బంజారా భవన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. మంత్రుల వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్లు మన్నే కవిత రెడ్డి, వెల్దండ వెంకటేష్, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.