Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇంజినీరింగ్ కళాశాలల్లో పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫీజుల పెంపుతో పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి క్లాస్రూమ్లు, ల్యాబ్లు, టీచింగ్ స్టాఫ్, మౌలిక వసతుల కల్పన ఎలా ఉన్నాయో పర్యవేక్షించకుండానే ఫీజుల పెంపునకు అవకాశం ఇవ్వడం దుర్మార్గమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలలో ఒకే రకమైన ఫీజులను నిర్ణయించి ప్రభుత్వమే కట్టాలని డిమాండ్ చేశారు. అకాడమిక్ ఇయర్ పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించడం అన్యాయమని పేర్కొన్నారు.