Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర అమలు చేస్తున్న ఎఫ్ఆర్బీఎం చట్టంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం అనే అంశంపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అమలు చేయడంతో కేంద్రం వైఫల్యాలపై అసెంబ్లీలో మరో చర్చ చేపట్టనుంది. దీంతోపాటు తెలంగాణ అటవీ చట్టంలో కొన్ని మార్పులను తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆ చట్ట సవరణను ప్రతిపాదించనున్నారు. దీంతోపాటు ఆయా శాఖల మంత్రులు పలు బిల్లులకు సవరణలను కోరనున్నారు.