Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫిక్కీ, ఎఫ్టిసిసిఐలతో కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిర్వహించిన ఎక్స్పోర్ట్ ఉత్సవ్కు విశేష స్పందన లభించింది. బుధవారం హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో జరిగిన 'వర్థమాన వ్యాపారాలు, ఆర్థిక అవకాశాలు' సెమినార్కు 150 మంది పైగా ఎగుమతి దారులు హాజరయ్యారు. ఎగుమతుల ప్రక్రియా, విధానం, డాక్యూమెంట్ల అవసరం, మార్కెట్లో అవకాశాలపై ఇందులో చర్చించారు. ఈ సందర్బంగా ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ ఎగుమతుల అవశ్యకతను తెలిపారు.. అహ్మాదాబాద్ నుంచి వచ్చిన అంతర్జాతీయ ఎగుమతుల ట్రెయినర్లు పరేష్ సోలంకి, సంకిత్ సోని ఎగుమతుల రంగం అవకాశాలను సవివరంగా తెలిపారు.