Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని బంజారా హిల్స్ నందు విడివిడిగా నిర్మించిన కుమ్రం భీమ్ ఆదివాసీ, సేవాలాల్ బంజారా ఆత్మగౌరవ భవనాలను శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ భవనాలను ప్రయివేట్ ఫంక్షన్ హాళ్లకు దీటుగా వేడుకలు, సదస్సులు, సమావేశాలు జరుపుకునేందుకు అనువుగా నిర్మించారు. వీటిలో వేయి సీట్ల సామర్ధ్యం కలిగిన ఆడిటోరియాలను ఏర్పాటు చేశారు. మీడియాతో పాటు ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, కళలు ,వేడుకలను తెలియజేసే లైబ్రరీ, ఆర్ట్ ఫాక్ట్, పెయింటింగ్ల ప్రదర్శనకు ఆయా భవనాల్లో నాలుగు సువిశాల గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రతి భవనంలో మూడు వీఐపీ లాంజ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 250 మంది ఒకేసారి భోజనం చేసే విధంగా భోజన శాలను నిర్మించారు.