Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో ప్యూడల్ భూస్వామ్య వ్యవస్థ కూలిపోకుండా అడ్డుకున్నదే సెప్టెంబర్ 17 దినమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజాం రాజ్యంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మృగ్యమై వెట్టి చాకిరీ అమలవుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రారంభమైందే సాయుధ రైతాంగ పోరాటమని తెలిపారు. ఆ డిమాండ్లు సాధించకుండానే పోరాట విరమణ జరిగిందని పేర్కొన్నారు.