Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
అప్పుల బాధకు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అంబటి సతీష్(36) వ్యవసాయం వదిలి ట్రాక్టర్ కొన్నాడు. ట్రాక్టర్ను డోజర్గా రీ మోడ లింగ్ చేయించేందుకు సుమారు రూ.20 లక్షల వరకు అప్పులైనట్టు సమాచారం. దాంతో మనో వేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రమాదేవి తెలిపారు.