Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి తనకెలాంటి నోటీసులూ రాలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనకు నోటీసులు జారీ చేసినట్టు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. ఢిల్లీలో కూర్చుని కొంద రు దురుద్దేశపూర్వకంగా మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శి ంచారు. మీడియా సంస్థలు తమ సమయాన్ని నిజాల్ని చూపించేందుకు ఉపయోగించాలని హితవు పలికారు. టీవీ వీక్షకుల విలువైన సమ యాన్ని ఆదా చేసేందుకు.. తనకెలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేయదలచుకున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.