Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్డబ్ల్యూ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడోవిడతలో 66,526 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్, భౌతికంగా సంబంధిత కాలేజీలకు ఈనెల 22 వరకు రిపోర్టు చేసేందుకు అవకాశముందని తెలిపారు. తొలి, రెండో విడతలో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన అభ్యర్థులు సీసీఓటీపీని సమర్పించి సీట్లను ధ్రువీకరించాలని సూచించారు. ఒకవేళ రిపోర్టు చేయకపోతే సీట్లు కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు https://dost.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.