Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వాతంత్య్రోద్యమం, హైదరాబాద్ సమైక్యతా ఉద్యమం, తెలంగాణ ఉద్యమాల్లో బీజేపీ పాత్ర ఏదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీజేపీ వాళ్లకు అలవాటైన ''ఎన్నికల ఉత్సవాలు'' అన్న సహజ సూత్రం అధారంగా రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రాలకు వచ్చి హామీలివ్వడం, ప్రజలు వారిని తిరస్కరించగానే, వంచించడం బీజేపీకి అలవాటని తెలిపారు.