Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సెప్టెంబర్ 17 కచ్చింతంగా విద్రోహదినమేనని సీపీఐ (ఎంఎల్ )ప్రజాపంథా కార్యదర్శి వర్గ సభ్యులు కేజీ రామచందర్ తెలిపారు. శనివారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విలీనం, విమోచన, విద్రోహం అంశంపై జిల్లా కార్యదర్శి ఎం. హన్మేశ్ అధ్యక్షతన కేజీ. రామచందర్ మాట్లాడారు. మూడు వేల గ్రామాలను విముక్తి చేసి, పదిలక్షల ఎకరాలను పేదలకు గొప్ప పోరాటమని తెలిపారు. తిరిగి భూస్వాములకు, జాగీర్దార్లకు, దొరలకు అధికారాన్ని హస్తగతం చేయటం విద్రోహం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కె.రమ, ఎస్ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు.