Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓబన్న వడ్డెర యువజన జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అధికారంలోకి వస్తే వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి బీజేపీ మోసం చేసిందని ఓబన్న వడ్డెర యువజన జేఏసీ విమర్శించింది. ఈ మేరకు ఆ జేఏసీ చైర్మెన్ గుంజి సంతోష్ కుమార్ వడ్డే రాజ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 15 జాతులను గుర్తించి ఎస్టీలో చేర్చేందుకు నిర్ణయించి వడ్డెరలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిపిందని గుర్తుచేశారు. బీజేపీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలనీ, లేకపోతే రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.