Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్పై ఉత్తమ్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉద్యోగ, విద్యలో ఎస్టీ రిజర్వేషన్లు పెంపుదల, గిరిజన బంధు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ చెప్పడం బూటకమేనని ఎంపీ ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆరుశాతం రిజర్వేషన్లు 10శాతం పెంచడం 'గిరిజన బంధు' పథకం ద్వారా అర్హులైన ఎస్టీ కుటుంబాలకు రూ.10 లక్షల సాయం లాంటివి మరో ఎండమావి లాంటిదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కేసీఆర్ ఎప్పుడూ పన్నుతున్న ట్రిక్ అని ఎద్దేవా చేశారు.