Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
- 15 వరకు వెబ్ఆప్షన్ల నమోదు
- 18న తొలివిడత సీట్ల కేటాయింపు
- షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చేనెల ఎనిమిది నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ సోమవారం షెడ్యూల్ను విడుదల చేశారు. వచ్చేనెల ఎనిమిది నుంచి 12 వరకు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండడంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశముందని తెలిపారు. అదేనెల పది నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. పది నుంచి 15 వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. వచ్చేనెల 18న తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. అదేనెల 21 వరకు ఆన్లైన్లో సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలనీ, ట్యూషన్ చెల్లించాలని సూచించారు. అదేనెల 23 నుంచి ఐసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 24న ధ్రువపత్రాల పరిశీలన, 23 నుంచి 25 వరకు వెబ్ఆప్షన్లను నమోదు చేయాలని కోరారు. 28న సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 28 నుంచి 30 వరకు ఆన్లైన్లో సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలనీ, ట్యూషన్ ఫీజు చెల్లించాలని సూచించారు. వచ్చేనెల 29 నుంచి 31 వరకు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని తెలిపారు. అదేనెల 28న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈనెల 27 నుంచి https://tsicet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.