Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాహితీ సృజనకారుల ఆత్మబంధువు, సాహితీవేత్త నిజాం వెంకటేశం మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పేదరికంలో ఉన్న తెలంగాణ కవుల బాగోగులను కనిపెట్టుకుంటూ, వారికి చేదోడువాదోడుగా ఉంటూ సాహిత్యం పట్ల వెంకటేశం కనబరిచిన ఆత్మీయానుబంధం గొప్పదని తెలిపారు. ఆయన మరణం సాహిత్య రంగానికి తీరని లోటని తన సంతాప సందేశంలో సీఎం పేర్కొన్నారు. వెంకటేశం కుటుంబ సభ్యులకు ఆయన ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలంగాణ సాహితీ సంతాపం...
వెంకటేశం మరణం పట్ల తెలంగాణ సాహితీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఆయన మరణంతో గొప్ప సాహితీవేత్తను కోల్పోయామని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్థన, కె.ఆనందాచారి పేర్కొన్నారు. వెంకటేశం కుటుంబ సభ్యులకు వారు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలిపారు.