Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో యూజీ, పీజీ కోర్సులకు సంబంధించిన జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో కలిసి ఉన్నత విద్యామండలి అధ్యయనం చేస్తున్నది. అందులో భాగంగా సోమవారం హైదరాబాద్లో ఐఎస్బీ ప్రతినిధులు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రితో భేటీ అయ్యారు. ఆఫ్లైన్ మూల్యాంకనం వల్ల వస్తున్న సమస్యలపై వారు చర్చించారు. సకాలంలో ఫలితాలు విడుదల చేసేందుకు ఆన్లైన్ మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఇతర దేశాలు, పలు రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో అమలవుతున్న ఆన్లైన్ మూల్యాంకనాన్ని అధ్యయనం చేసి రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా నివేదికను తయారు చేయాలని సమాలోచన చేస్తున్నారు.