Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితబంధు పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ కావడం లేదంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సర్కార్ నుంచి సరిపడ నిధులు విడుదల చేయడం లేదంటూ తప్పుడు వార్తలు రాయడం బాధాకరమని తెలిపారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతున్నదని పేర్కొన్నారు. లబ్దిదారులు తమకు నచ్చిన వ్యాపారం చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. సర్కారు ప్రకటించిన విధంగానే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమైందని ఒక ప్రకటనలో వెల్లడించారు.