Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారనే కేసులో అరెస్టయిన వ్యక్తులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర సహా మొత్తం 17 మందిపై ఫిర్యాదు చేశారు. దీంతో మహబూబ్నగర్ కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటి అమలును హైకోర్టు నిలిపివేసింది. ఇందుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్నగర్కు చెందిన బి.విశ్వనాథ్, సి.రాఘవేంద్ర రాజును కిడ్నాప్ చేసి అక్రమంగా నిర్బందించారంటూ విశ్వనాథ్ భార్య పుష్పలత ఫిర్యాదు చేశారు.