Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే రాష్ట్ర ప్రజలే బీజేపీని తరిమికొడతారని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య హెచ్చరించారు. తక్షణం ఆ ఆలోచనను కేంద్రం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో...ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు... ధరల పెరుగుదల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేవలం మత చిచ్చు రేపి ప్రజల మధ్య చీలికలు తేవటమే ఆ పార్టీ లక్ష్యమని విమర్శించారు.