Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పదో వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్లోని గెజిటెడ్ భవన్లో టీజీవో అధ్యక్షులు వి మమత ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, సహాధ్యక్షులు ఎస్ సహదేవ్, నగర శాఖ అద్యక్షులు జి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ అధ్యక్షులు ఎంబి కృష్ణాయాదవ్ ఘనంగా నివాళులర్పించారు. పోరాట యోధుడు, వెనుకబడ్డ కులాలకు గొప్ప కీర్తి తెచ్చిన మహానేత అంటూ ఆయన సేవలను వారు కొనియాడారు. బాపూజీ ఆశయసాధనకు ముందుంటామని వివరించారు.