Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రవాణా సేవల విస్తృతికి, తమ సంస్థ ప్రజలకు కల్పిస్తున్న పథకాలు, సేవలు, రవాణా సదుపాయాల కల్పన వంటి విషయాల్లో మరింత ప్రజాదరణ పొందేందుకుగానూ కళాబృందాల ద్వారా ప్రచారాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్తున్నామని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఐపీఎస్ వి.సి.సజ్జనార్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో టీఎస్ఆర్టీసీ సేవలపై మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన ప్రచార రథాన్ని గురువారం బస్భవన్లో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రయాణికులకు ఆర్టీసీ కల్పిస్తున్న రాయితీలు, పథకాలు, సేవలను కళాబృందాల ద్వారా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ పాటల రూపంలో ప్రచారం చేయిస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలంతా టీఎస్ఆర్టీసీని ఆదరించాలనీ, సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి, ఆర్ఎం, డిప్యూటీ ఆర్ఎం, తదితరులు పాల్గొన్నారు.