Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మానవతా దృక్పథంతో ప్రభుత్వ శాఖలు, కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్దీకరణ కోసం మంత్రివర్గంలతో ఆమోదించి ఉత్తర్వులు విడుదల చేయాలంటూ అధికారులను ఆదేశించారని జీవోనెంబర్ 16 కాంట్రాక్ట్ ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొప్పిశెట్టి సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొన్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల కుటుంబాల తీవ్ర మానసిక ఆవేదన చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సైతం జీవో నెంబర్ 16కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కొంతమంది ఉన్నతాధికారులు అనేక సాకులు చెప్తూ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని వెంటనే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.