Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్తో పాటు సీపీఐ(ఎం)లో నాయకులుగా ఇల్లందులో పనిచేసిన కారం సంజీవి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు పి.రాజారావు పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన అత్యంత క్రమశిక్షణతో పనిచేసిన నాయకుడనీ, మృదుస్వభావి అని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.