Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్డబ్ల్యూ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు కేటాయించిన కాలేజీల్లో చేరే గడువును ప్రభుత్వం శుక్రవారం వరకు పొడిగించింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మొదటి, రెండు, మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్రిపోర్టింగ్ చేయడంతోపాటు కాలేజీల్లో రిపోర్టు చేసే గడువు శుక్రవారం వరకు పొడిగించామని తెలిపారు. ఇతర వివరాలకు https: //dost.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.