Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛభారత్ సర్వేక్షణ్లో 13 అవార్డులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమస్థానాన్ని ఆక్రమించడాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు ఈ ర్యాంక్ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. సమిష్టి కషితో, పల్లె ప్రగతిని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద పలు విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం 13 అవార్డులు దక్కించుకుని, దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'పల్లె ప్రగతి' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామీణాభివద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రినీ, ఆ శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులను ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రగతిలో తన వంతుగా గుణాత్మక భాగస్వామ్యం పంచుకుంటుందనీ, ఇదే తరహా ఒరవడి కొనసాగిస్తామనీ చెప్పారు.