Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే రికార్డు సృష్టించనున్న తెలంగాణ
- మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 19,472 క్రీడా ప్రాంగణాలు
- ఇప్పటికే 5,602 ప్రాంగణాల పనులు పూర్తి : సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రతి ఆవాసంలో క్రీడా ప్రాంగణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తున్న ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణప్రాంతాల్లో 19,472 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చేయబడుతున్నాయి. అందులో ఇప్పటికే 5,602 ప్రాంగణాలు రెండు పనులు పూర్తయ్యాయి. 7,787 పనులు పురోగతిలో ఉన్నాయి. ఆటలు కేవలం దేహ దారుఢ్యానికే కాదు. మానసికోల్లాసానికి కూడా దోహదపడతాయి. ఆటలు ఆరోగ్యదాయకం కూడా. అందుకే ఒకప్పుడు పాఠశాలల్లో ప్రతి రోజూ ఒక ఆటల పీరియడ్ ఉండేది. ఓ క్రాఫ్ట్ టీచర్ ఉండేవారు. ఏ టీచర్ రాకపోయినా, ఆ పీరియడ్ ఆటలకే అంకితమయ్యేది. వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది. అంతేనా! స్కూల్ చుట్టీబెల్ కొట్టారంటే చాలు... పుస్తకాలు గ్రౌండ్లోనే ఓ మూలన పడేసి...చీకటి పడేదాకా... నచ్చిన ఆటలు ఇష్టానుసారంగా ఆడుకునేవాళ్ళం అని చాలా మంది తమ పిల్లలకు చెప్తారు. అందునా గ్రామంలోని యువకులు, ఔత్సాహిక క్రీడాకారులు అనేక మంది, టీచర్స్, పోలీస్...ఇలా అనేక వర్గాల వాళ్ళు వచ్చి అదే గ్రౌండ్ లో ఆడే ఆట పాటలతో ఎల్లప్పుడూ సందడిగాకనిపించేది.
విద్యార్థులు పొద్దున్నే గ్రౌండ్కి వెళ్ళి... పీఈటీ సార్ ఇచ్చే శిక్షణ, వామప్ వంటివి చేసేవారు. మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి లాంటి గ్రామంలో ఓ పీఈటీ ఇచ్చిన శిక్షణ వెంకట నారాయణ లాంటి అనేక మంది అంతర్జాతీయ క్రీడా కారులనే తయారు చేసింది. చిన్నప్పటి నుంచే పిల్ల లకు శిక్షణనిస్తే అంత గొప్ప విజయాలను అందిం చింది. అందుకే అక్కడి క్రీడలకు తగిన ప్రోత్సాహం ఇస్తూనే, గ్రామీణ క్రీడాకారులను గొప్పగా తీర్చిదిద్దే పనిని ప్రభుత్వం ఒక విధానంగా పెట్టుకుంది. కేవలం ఒక చోట శిక్షణ ఇచ్చే మూస పద్ధతిని కాదనీ, ప్రతి ఆవాసానికి ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసే బృహత్తర కార్యక్రమానికి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రతి ఆవాసంలో కనీసం ఒక ఎకరా స్థలానికి తగ్గకుండా సేకరించి, అందులో క్రీడా మైదానాన్ని అభివృద్ధి పరిచారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్డు, నగర ప్రాంతాల్లో డివిజన్లలో కనీసం ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. ఆ క్రీడా ప్రాంగణాల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ పిట్, ఎక్సర్ సైజ్ బార్ వంటి పరికరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో మొత్తం 13,418 ప్రాంతాల్లో అనువైన స్థలాలను ఇప్పటికే గుర్తించారు. వీటిలో 10,451 గ్రామ పంచాయతీల్లో, 2,967 ఆవాసాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కానున్నాయి.
ఇప్పటివరకు 5,602 పనులు పూర్త య్యాయి. 7,787 పనులు కొనసాగుతున్నాయి. మిగతా పనులు వివిధ దశలలో ఉన్నాయి. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిం చడంతో పాటు విద్యా ర్థులు, యువకులు ఆరోగ్యంగా, హాయిగా ఉండేం దుకు వీలుగా ఈ క్రీడా ప్రాంగణాలు ఉపయోగ పడాలన్నది. ఈ ఫలితాలు సాధించేందుకు క్రీడా ప్రాంగణాలు దోహదం చేయాలనీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ క్రీడాకారులు మన రాష్ట్రం నుంచే తయారవ్వాలని ఆశిద్దాం.ఈమేరకు సమాచార పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.