Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సోమవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, అందుకు గల అవకాశాలతో పాటు పలు అంశాలపై వారు చర్చించారు.
గవర్నర్తో భేటీ
గారెత్ విన్ ఓవెన్ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్తోనూ భేటీ అయ్యారు. సోమవారం రాజ్ భవన్లో ఆయన గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.