Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. అధికార టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి గతంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. 2015లో ఇండోనేషియా వేదికగా గోల్డ్మైన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టడంతో పాటు మనీ లాండరింగ్కు పాల్పడినట్టు ఎమ్మెల్యేపై అభియోగాలు ఉన్నాయి. ఈ అంశంపై ఆయనకు నెల రోజుల కిందటే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆ మేరకు ఆయన లిఖితపూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు. సంతృప్తి చెందని ఈడీ స్వయంగా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు.